ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు పట్ల హర్షం

50చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కోటి మాదిగ అన్నారు. గురువారం సింగరాయకొండలో అంబేద్కర్, జాగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల కలను సాకారం చేయడంలో చివరి ఘట్టంలో ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ దిశగా అడుగులు వేసి మాదిగల చిరకాల స్వప్నం నెరవేర్చాలన్నారు.

సంబంధిత పోస్ట్