డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి మంత్రి అయిన తరువాత ఆదివారం తొలిసారిగా జిల్లాకు రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి ఆంజనేయులు స్వామి గుడిలో పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు వల్లూరమ్మ తల్లి దేవస్థానం నందు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5. 30గంటలకు నూరారెడ్డిపాలెం వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు.