టంగుటూరు: అప్రమత్తమైన అధికారులు

63చూసినవారు
ప్రకాశం జిల్లా టంగుటూరులోని పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలోకి సమీప పొలాల నుంచి వరదనీరు వచ్చి చేరుతున్న విషయాన్ని గుర్తించిన అధికారులు మంగళవారం అర్ధరాత్రి సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన వరద నీరు కాలనీలోకి వెళ్లకుండా దారి మళ్ళించారు. పోక్లైన్ సహాయంతో మరమ్మత్తులు చేపట్టి చర్యలు తీసుకున్నారు. తక్షణమే స్పందించిన అధికారులను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్