
దొనకొండ మండలంలో పాస్టర్లు శాంతియుత ర్యాలీ
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దొనకొండ మండల పాస్టర్ ఐక్యతగా చేరి శనివారం మండల కేంద్రంగా క్రైస్తవ సహోదరులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో క్రైస్తవులపై ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సంఘటనపై న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండలంలోని క్రైస్తవులు అందరూ పెద్దఎత్తున భారీ సంఖ్యలో హాజరు కావడం జరిగింది.