టిడిపి గెలుపుతోనే దర్శి అభివృద్ధి సాధ్యం: గొట్టిపాటి లక్ష్మి
టిడిపి గెలుపుతోనే దర్శి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని దర్శి నియోజకవర్గ టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి మండలంలోని మారెడ్డి పల్లె, చందలూరు గ్రామాలలో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని తెలిపారు. టిడిపిని ఆదరించి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు.