ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెచ్చిపోయిన ఆకతాయిలు

1552చూసినవారు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెచ్చిపోయిన ఆకతాయిలు
ప్రకాశం జిల్లా కొమరోలులో ఆకతాయిలు రెచ్చిపోయారు. కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి పాఠశాల ఆవరణలో ఉన్న సిమెంట్ బెంచీలను, సూచిక దిమ్మలను ధ్వంసం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆకతాయిలు విధ్వంసానికి దిగి ఉంటారని పాఠశాల ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా మంగళవారం పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్