ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని పాములపల్లిలో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డికే ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలకు నాయకులు కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు పంచారు.