గిద్దలూరు: సగిలేరు వాగుకు పెరుగుతున్న వరద ఉద్ధృతి

69చూసినవారు
గిద్దలూరు సమీపంలోని సగిలేరు వాగుకు వరద ఉధృతి పెరుగుతుంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మంగళవారం సగిలేరుకు వరదనీరు వచ్చి చేరుతుంది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. గిద్దలూరు పరిసర ప్రాంతాలలో తుఫాను కారణంగా ప్రజలు సమస్యలు ఎదుర్కుంటే సహాయం కోసం 6303368419 నంబర్ ను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్