కంభం చెరువును పరిశీలించిన జాయింట్ కలెక్టర్

70చూసినవారు
కంభం చెరువును పరిశీలించిన జాయింట్ కలెక్టర్
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువును జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. రెండు రోజుల నుంచి గిద్దలూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కంభం చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇంకా 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గోపాలకృష్ణ వివరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తో పాటు కంభం తహశీల్దార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్