పెరిగిన సగిలేరు వాగు ఉధృతి

63చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట సమీపంలో సగిలేరు వాగు ఉదృతి భారీగా పెరిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదివారం సగిలేరు వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వాగు ఉధృతి పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వరద పరిస్థితిలను పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్