పాఠశాలకు వెళ్లాలంటే భయంగా ఉంది

67చూసినవారు
కంభం మండలం నర్సిరెడ్డి పల్లె గ్రామం నుండి తురిమెళ్ళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలంటే 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు తెలుపుతున్నారు. పాఠశాలకు, గ్రామానికి మధ్యలో మద్యం దుకాణం ఉండటంతో మద్యం ప్రియులు రోడ్ల మీద, బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని దీంతో విద్యార్థినీలు పాఠశాలలకు వెళ్లాలంటే భయపడుతున్నామని తెలుపుతున్నారు. అధికారులు స్పందించి మద్యం దుకాణాన్ని మరోచోటికి మార్చాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్