జీతాల కోసం నిరసనకు దిగిన స్వచ్ఛభారత్ కార్మికులు

62చూసినవారు
కొమరోలు ఎంపీడీవో కార్యాలయం ముందు సోమవారం స్వచ్ఛభారత్ పారిశుద్ధ్య కార్మికులు తమ వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని నిరసనకు దిగారు. 4 సంవత్సరాలుగా తమ జీతాలు చెల్లించలేదని అప్పులు చేసి మరి తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఉన్నత అధికారులను కలిసి విన్నవించిన తమకు న్యాయం జరగలేదని తక్షణమే తమ జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్