శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం తగదు

55చూసినవారు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం తగదని కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు. శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం కనిగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసిపి నేతలతో కలిసి ఆయన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్