జరుగుమల్లి మండలం పాలేటిపాడు గ్రామంలో శుక్రవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండేపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలం సురేష్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండేపి ఎమ్మెల్యే గా ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మే13న జరుగు ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ని గెలిపించాలన్నారు.