కొండేపి: సిపిఎం ఆధ్వర్యంలో నిరసన

73చూసినవారు
కొండేపి: సిపిఎం ఆధ్వర్యంలో నిరసన
సీపీఎం ఆధ్వర్యంలో కొండేపి ఆర్టీసీ బస్టాండ్ వద్ద విద్యుత్ బిల్లులపై అదనపు చార్జీలు రద్దు చేయాలని శుక్రవారం నిరసన చేపట్టారు. మండల కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 8113 కోట్ల ఛార్జీల సర్దుబాటు పేరుతో అదనపు భారాన్ని మోపారని, 2023-24 కు సంబంధించి మరో రూ. 11 వేల కోట్లు వినియోగదారుని పై భారం మోపారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్