సింగరాయకొండ: పాకల బీచ్ లో పర్యాటకుల సందడి

52చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయ కొండ మండలం పాకల బీచ్ లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్ కు పర్యాటకులు తరలివచ్చారు. పెద్దలు, చిన్నారులు సముద్ర కెరటాలతో ఆడుకుంటూ ఇసుక తిన్నెలపై సరదాగా గడిపారు. తుఫాను తగ్గడంతో సందర్శకుల తాకిడి నెలకొందని స్థానిక వ్యాపారులు తెలిపారు. తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మెరైన్ పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్