108లో మహిళ ప్రసవం తల్లి బిడ్డ క్షేమం

67చూసినవారు
108లో మహిళ ప్రసవం తల్లి బిడ్డ క్షేమం
నాగులుప్పలపాడు మండలంలోని నూజిల్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కత్తి రమ్యకు సోమవారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. దాంతో కుటుంబ సభ్యులు 108లో ఒంగోలు ఆసుపత్రికి తరలిస్తుండగా రాచపూడి వద్దకు రాగానే నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది అంబులెన్స్లోనే ప్రసవం చేశారు. రమ్య మగ బిడ్డకు జన్మనిచ్చింది. తదుపరి వైద్య పరీక్షలు నిమిత్తం తల్లీ, బిడ్డను ఒంగోలుకు తరలించారు. దాంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్