పవన్, చంద్రబాబులపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు

64చూసినవారు
పవన్, చంద్రబాబులపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
పవన్, చంద్రబాబులపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నారాయణమూర్తి, శ్రీనివాసరెడ్డిలు సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఈనెల 28న మంత్రాలయంలలో సీఎం జగన్ గారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈనెల 28న ప్రచారంలో మాట్లాడుతూ జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి పవన్, చంద్రబాబులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్