AP: ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు, తర్వాత రోజుల్లో చెలరేగిన హింసపై ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ను నియమించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి సీఈవో కార్యాలయం నివేదించినట్లు తెలుస్తోంది. రేపటిలోగా పూర్తి నివేదికను అందిస్తుందని, తర్వాత కీలక నేతలను అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరింత మంది పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోనున్నారట.