విజయవాడలో వరద బాధితుల్ని తరలించేందుకు రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్న ప్రైవేట్ బోట్స్ (వీడియో)

67చూసినవారు
విజయవాడలో వరదల వల్ల నీట మునగిన ప్రాంతాలలోని ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కొందరు ప్రైవేట్ బోటు యజమానులు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.2-5 వేలు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో బోటు యజమానులతో బాధితులు బేరం ఆడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్