హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: పురంధేశ్వరి

58చూసినవారు
హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: పురంధేశ్వరి
హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. 1975వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తి ని దెబ్బతిసి, వేలాది మంది సిక్కులని ఊచ కోత విధించిన వారు పార్లమెంట్ లో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హిందువుల మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకువాలని, హిందూ ప్రజల కి క్షమాపణ చెప్పాలని కోరారు.

సంబంధిత పోస్ట్