ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం ఏకంగా 109 మండలాల్లో తీవ్ర వడగాలులు, 206 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం 115 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.