దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవాళ విడుదల కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెంటీస్’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పెద్దలు ప్రకటించనున్నారు. అనంతరం శనివారం రాజస్థాన్లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు.