జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు చెందిన రూ.31 కోట్ల విలువ గల 8.86 ఎకరాల భూమిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం జప్తు చేసుకుంది. నగదు అక్రమ చలామణి కేసు విచారణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. మార్చి 30న ఈడీ ఇచ్చిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదును ప్రత్యేక న్యాయస్థానం గురువారం పరిగణనలోకి తీసుకుంది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ భూమిపై ఆదేశాలిచ్చింది.