ఏపీలో పెన్షన్ల డబ్బు విడుదల

24451చూసినవారు
ఏపీలో పెన్షన్ల డబ్బు విడుదల
ఏపీలో మే నెల పెన్షన్ల సొమ్ము ₹1939.35 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 65.30 లక్షల మంది పెన్షనర్లలో 47.74 లక్షల మందికి జూన్ 1న ఖాతాల్లో నగదు జమ చేయనుంది. మిగతా వారికి జూన్ 5లోగా డోర్ టు డోర్ పెన్షన్ పంచనుంది. పంచాయతీ/వార్డు పరిపాలనా కార్యదర్శులు పెన్షన్ డబ్బును మే 31న డ్రా చేసి సచివాలయాల సిబ్బందికి ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించింది.

సంబంధిత పోస్ట్