సాయిధరమ్ తేజ్‌పై దాడి జరగలేదు: డీఎస్పీ

82చూసినవారు
సాయిధరమ్ తేజ్‌పై దాడి జరగలేదు: డీఎస్పీ
హీరో సాయిధరమ్ తేజ్‌పై ఎలాంటి దాడి జరగలేదని డీఎస్పీ హనుమంతరావు స్పష్టతనిచ్చారు. నిన్న తాటిపర్తిలో ప్రచారంలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్‌పై దాడి జరిగినట్లు ప్రచారం జరిగింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు సోమవారం వివరాలు వెల్లడించారు. సాయిధరమ్ తేజ్ ప్రచారం నుంచి వెళ్లిపోయిన 15 నిమిషాల తర్వాత ఈ ఘటన జరిగిందని, దీనికి కారకులైన ఇద్దరు వ్యక్తులను గుర్తించామన్నారు. ప్రచారం చూడటానికి వచ్చిన ఓ వ్యక్తికి గాయమైందన్నారు.

సంబంధిత పోస్ట్