ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఆర్సెట్ 2024-25 పరీక్షలు ముగిశాయి. మొత్తం 10,050 మంది దరఖాస్తు చేసుకోగా, 8,651 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని కన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్ తెలిపారు. కాగా ఈనెల 15న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. జూన్ లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.