అమరావతి రైతుల సంచలన నిర్ణయం

58చూసినవారు
అమరావతి రైతుల సంచలన నిర్ణయం
1,560 రోజులుగా రాజధాని అమరావతి కోసం పోరాడుతున్న రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. పోలీసుల సూచనల మేరకు తాత్కాలికంగా రాజధాని ఉద్యమానికి విరామం ప్రకటించామని ఐక్య కార్యాచరణ సమితి తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో బహిరంగ సమిష్టి నిరసన కార్యక్రమానికి బ్రేకులు వేస్తున్నామని జేఏసీ నేతలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్