వేసవి షెడ్యూల్‌ను ప్రకటించిన విమానయాన సంస్థలు

53చూసినవారు
వేసవి షెడ్యూల్‌ను ప్రకటించిన విమానయాన సంస్థలు
ప్రస్తుత వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున దేశీయంగా విమాన సర్వీసులు అందించబోతున్నట్లు ప్రకటించాయి. గతంతో పోలిస్తే ఇది 6 శాతం అధికమని ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ డీజీసీఏ వెల్లడించింది. ఇండిగో, ఎయిర్‌ ఇండియా, విస్తారాలు అత్యధికంగా విమాన సర్వీసులు నడపనుండగా..స్పైస్‌జెట్‌ మాత్రం తన సర్వీసుల సంఖ్యను తగ్గించుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్