ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇష్టారాజ్యంగా వ్యవహరించారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. నెల్లూరులో చింతా మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని తాము ఆశించామని, షర్మిల వ్యూహం తప్పయిందని అభిప్రాయపడ్డారు. ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని, ఇండియన్ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు.