మియాపూర్‌లో రోడ్డు కుంగిపోయి ఏర్పడిన 10 అడుగుల భారీ గుంత.. భయాందోళనలో ప్రజలు

71చూసినవారు
హైదరాబాద్ లోని మియాపూర్ దీప్తిశ్రీ నగర్ కాలనీలో ఒక్కసారిగా రోడ్డు కుంగింది. రోడ్డు మధ్యలో 10 అడుగుల గొయ్యి ఏర్పడటంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కుంగిన రోడ్డు పక్కనే వాటర్ పైప్ లైన్, డ్రైనేజీ పైప్ లైన్‌లు ఉన్నాయి. స్థానికుల సమాచారంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు గొయ్యి ఏర్పడ్డ మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. మరమ్మత్తులు చేయడానికి R&B అధికారులు రంగంలోకి దిగారు.

సంబంధిత పోస్ట్