ఏపీలో బీజేపీకి షాక్.. కీలక నేత రాజీనామా

71చూసినవారు
ఏపీలో బీజేపీకి షాక్.. కీలక నేత రాజీనామా
ఏపీలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేత రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి మొడియం శ్రీనివాస రావు తన పదవి, సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. రాష్ట్ర పార్టీలో ఆదివాసీలంటే చాలా చులకన భావం ఉందని అన్నారు. అరకు ఎస్టీ పార్లమెంట్ బీజేపీ టికెట్ కొత్తపల్లి గీతకు ఇవ్వొద్దన్నారు.

సంబంధిత పోస్ట్