ప్రశ్నించిన వారిని తన్నడానికే సిద్ధమా? అని వైసీపీని
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. నందిగామలో
వైసీపీ అరాచకపర్వం పేరుతో వీడియోను పోస్టు చేశారు. రాజధాని ఎక్కడని ప్రశ్నించిన వారిపై
వైసీపీ సైకోలు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దాడులు జరగడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.