వైసీపీ హయాంలో కొన్ని శాఖలు నిర్వీర్యం: అచ్చెన్నాయుడు

82చూసినవారు
వైసీపీ హయాంలో కొన్ని శాఖలు నిర్వీర్యం: అచ్చెన్నాయుడు
వైసీపీ హయాంలో కొన్ని ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం అయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేపటి నుంచి వారం రోజుల పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు ఇవ్వలేదని రైతుల నుంచి ఫిర్యాదు రాకుండా చూసుకోవాలన్నారు. అలాగే సాగునీటి వనరులకు నిధులు లేవని చెప్పొద్దన్నారు.

సంబంధిత పోస్ట్