AP: పిఠాపురం వేదికగా జరగనున్న 12వ ఆవిర్భావ సభకు మహిళలను పెద్ద ఎత్తున ఆహ్వానించడానికి జనసేన పార్టీ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆడపడుచులను ఆహ్వానించేలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం కాకినాడ కంట్రోల్ రూమ్లో ప్రత్యేకంగా రూపొందించిన చుక్కల స్టిక్కర్లతో కూడిన ఆహ్వాన పత్రికను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.