ఉపాధి హామీ పనులకు వెళ్లి మహిళ మృతి

66చూసినవారు
ఉపాధి హామీ పనులకు వెళ్లి మహిళ మృతి
ఉపాధి హామీ పనికి వెళ్లి మహిళ మృతి చెందిన ఘటన కందుకూరు మండలంలో జరిగింది. అనంతసాగరం గ్రామానికి చెందిన కొప్పోలు చిన్న లక్ష్మమ్మ బుధవారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. సూరయ్య కుంట వద్ద పనులు చేస్తుండగా ఒకసారిగా లక్ష్మమ్మ కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన తోటి కూలీలు ఆమెను కందుకూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. కాగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఎంపీడీవో, ఏపీవో సందర్శించారు.

సంబంధిత పోస్ట్