కందుకూరు పట్టణం లోని పెద్ద బజారులో మహాత్మా గాంధీ విగ్రహం ఎదురుగా ఉన్న గాయత్రీ బంగారం నగల దుకాణంలో సహా రెండు కిరాణా షాపు లు, ఓ బియ్యం దుకాణంలో దొంగతనం జరిగింది. బాధితుల ఫిర్యాదుతో శనివారం సీఐ వెంకటేశ్వరరావు పోలీస్ సిబ్బంది సదరు దుకాణాల వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు బంగారు షాపులోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దొంగతనం కు పాల్పడినట్టు తెలుసుకున్నారు.