కోవూరు నియోజకవర్గం టిడిపి అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం ఇందుకూరుపేట మండలంలోని కొమరిక గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం రెండు సాధ్యమవుతాయన్నారు. టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ అధికార ప్రతినిధి దినేష్ రెడ్డి, నేతలు తదితరులు పాల్గొన్నారు.