కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఏఐసీసీ నేత కొప్పుల రాజు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి హరి నారాయణన్ కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. గతంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గా కొప్పుల రాజు పనిచేసిన విషయం తెలిసిందే. జిల్లాలో జరిగిన అక్షరాస్యత, సారా ఉద్యమాలకు ఆయన చేయూతనిచ్చారు.