తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. శ్రీగంధం వన ప్రాంతంలో చెట్లు దగ్ధమవుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. తిరుమలలో పొగ దట్టంగా అలుముకుంటుంది. వన్య ప్రాణులు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ ఎండలతో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.