మడుగు తేరు లాగిన ఎమ్మెల్యే కేతిరెడ్డి

53చూసినవారు
ధర్మవరం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవుల స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పట్టణ ప్రజలు మడుగు తేరును లాగారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోవింద నామ స్మరణతో ధర్మవరం మారుమ్రోగింది.

సంబంధిత పోస్ట్