గుత్తి: న్యాయమూర్తుల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

79చూసినవారు
గుత్తిలోని ఏడీజే, జూనియర్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఆవరణలో శనివారం ఏడీజే, మండల న్యాయ సేవా సమితి ఛైర్మన్ శ్రీహరి, సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ్ చారిల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం చీపుర్లు చేతపట్టి పరిసరాలు శుభ్రం చేశారు. మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్