పొలాల్లోకి దూసుకెళ్లిన టిప్పర్

71చూసినవారు
గుత్తి మండలం తొండపాడు గ్రామ సమీపంలోని 67వ నెంబర్ జాతీయ రహదారి పక్కన గురువారం కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా బోల్తాపడ్డ ట్రిప్పర్ ను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

సంబంధిత పోస్ట్