కదిరిలోని ఆలం ఖాన్ దర్గాలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వస్త్రం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. దర్గా నిర్వాహకులు బాలయ్యకు తలపాగా, వస్త్రం ధరించి ఆనవాయితీ ప్రకారం ప్రార్థనలు చేయించారు. దర్గాకు ప్రీతి పరమైన గంధపు పన్నీర్ను బాలయ్య సమర్పించారు. అనంతరం సామూహిక ప్రార్థనలు చేశారు.