శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య రథోత్సవం కార్యక్రమంలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. సోమవారం చిలమత్తూరు మండలం కనుమ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రథం లాగే విషయంలో పోటీ పడటంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆ సమయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పార్థసారథి పూజ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.