మిలాద్ -నబీ పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి: డిఎస్పి

58చూసినవారు
మిలాద్ -నబీ పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి: డిఎస్పి
మిలాద్ -నబీ పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ వి. రత్న ఆదేశాలతో సోమవారం జరిగే మిలాద్ నబి పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కదిరి డిఎస్పి శ్రీలత సూచించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో కదిరి సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు, పీస్ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్