ఎలైట్ జట్టుపై ఆర్డీటి క్యాంపు జట్టు గెలుపు

72చూసినవారు
ఎలైట్ జట్టుపై ఆర్డీటి క్యాంపు జట్టు గెలుపు
కదిరి ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన టి-20 క్రికెట్ పోటీలలో ఆర్డీటి క్యాంపు జట్టు ఏలైట్ జట్టుపై ఘన విజయం సాధించినట్లు కోచ్ నజీర్ తెలిపారు. మొదట బ్యాటింగ్ చేసిన ఎలైట్ జట్టు 20 ఓవర్లకు 167 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆర్డీటి క్యాంపు జట్టు మూడు ఓవర్లు మిగిలి ఉండగానే 168 పరుగులు చేసి గెలుపొందారు. ఆర్డీటి క్యాంపు జట్టు సభ్యుడు సాయి ప్రణీత్ 99 పరుగులు చేశారు.

సంబంధిత పోస్ట్