కళ్యాణదుర్గం: మద్యం షాపులకు టెండర్ల రుసుం చెల్లించిన ఎమ్మెల్యే

81చూసినవారు
కళ్యాణదుర్గం: మద్యం షాపులకు టెండర్ల రుసుం చెల్లించిన ఎమ్మెల్యే
టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఇవ్వడానికి తన సొంత డబ్బుతో మద్యం షాపులకు టెండర్లు వేశారని సోమవారం నాయకులు తెలిపారు. నియోజకవర్గంలో 10 మద్యం షాపులకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో టెండర్లు వేశారు. మద్యం షాపులకు దరఖాస్తు చేయడానికి రుసుం రూ. 2లక్షలు చెల్లించాలి. కార్యకర్తల తరపున 10 మద్యం షాపులకు 75 మందితో సొంత డబ్బు చెల్లించి దరఖాస్తు చేయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్