కళ్యాణదుర్గం: శ్రీరామిరెడ్డి కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె ఆగదు

83చూసినవారు
కళ్యాణదుర్గం: శ్రీరామిరెడ్డి కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె ఆగదు
కళ్యాణదుర్గం పట్టణంలో 7నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ 7రోజులుగా శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ సమ్మె ప్రాంతానికి వెళ్లి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం, కాంట్రాక్టర్ కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్