ముద్దినాయనపల్లి చెరువు గండిని పూడ్చిన గ్రామస్థులు

81చూసినవారు
కళ్యాణదుర్గం మండల వ్యాప్తంగా గత 4రోజులు నుంచి అత్యధిక వర్షాలు కురిసాయి. ఈ నేపథ్యంలో ముద్దినాయనపల్లి గ్రామ చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో బుధవారం చెరువుకు గండి పడటంతో చెరువులో నీరు మొత్తం వృధాగా బయటకు పోయాయి. అప్రమత్తమైన గ్రామస్థులు గండిని పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత పోస్ట్